Listen to this article

పట్టించుకోని మైనింగ్ , రివెన్వు ,అధికారులు..

జనం న్యూస్ 05జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ )

ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ( తుడుందెబ్బ ) జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వర రావు మాట్లాడుతూ కారుకొండా గుట్ట అక్రమ మైనింగ్ మాఫియా రాత్రి పగలు తేడా లేకుండా విచ్చల విడిగా జేసిబి తో తవ్వకాలు జరిపి ట్రాక్టర్ ల ద్వారా చుట్టూ పక్కల ప్రాంతాలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారనీ, ఐన అధికారులు మాత్రం మాకెందుకు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం ,పీసా చట్టాలను అమలు లో ఉన్న ,స్థానికేతర గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతం లోకి వచ్చి గుట్ట రాయిని తీసి ,మట్టిని జెసిబి ద్వారా తోవ్వి తీసుక పోతున్న చర్యలు తీసుకునే అధికారులు కరువయ్యారనీ, ఇప్పటి కైన అధికారులు స్పందించి గుట్టను తొడేస్తున్న మాఫియాను నిలుపుదల చేయాలి అన్నారు.