Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు గ్రామ సర్పంచ్ రాము ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం-2025 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నందలూరు, గ్రామపంచాయతీ లో బాబా సాయి నగర్ వద్ద చెట్లను, నాటే కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ ఎద్దుల సుబ్బారాయుడు,స్వచ్ఛ హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్లాస్టిక్ పెను భూతాన్ని తరిమేద్దాం. ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం.ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరుస్తానని.ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని. పచ్చని చెట్టే ప్రగతికి సోవాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ.ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకు తానని.చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ.ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగ స్వామి నవుతానని జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువులు గురించి అవగాహన పెంచు తానని. వనాలను నరకనని, నరక నివ్వనని. విరివిగా మొక్కలు నాటుతానని.మన ఊరూరా. వాడవాడ. ఇంటా బయటా, అన్ని చోటా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి.స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని సుబ్బరాయుడు, కోరారు అందరం ఈ స్వచ్ఛ హరిత యజ్ఞంలో పాలు పంచు కుందాం.ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చ దనంతో సింగా రిద్దాం. మొక్కలునాటుదాం.పర్యావరణాన్ని కాపాడుదా అని తెలిపారు ఈ కార్యక్రమంలో నందలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య,,మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ పల్లె సుబ్రహ్మణ్యం, నందలూరు గ్రామ సర్పంచ్ రాము, తదితరులు పాల్గొన్నారు