Listen to this article

జనం న్యూస్ జూన్(6)

తుంగతుర్తి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులో సీల్ చేయబడిన 20 వాహనాలను సూర్యాపేట జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్ లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో వేలంపాట నిర్వహించగా 18 వాహనాలకు రెండు లక్షల 90 వేల 280 రూపాయలు రాబడి వచ్చినది. ఇట్టి వేలంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూర్యాపేట ఇచ్చిన విలువకు 75% అధికంగా రాబడి వచ్చినది. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రజిత, డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్ సన్, ఎస్సైలు మూర్తి,జయప్రకాష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.