

మద్నూర్ జూన్ 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కొడిచిరా గ్రామంలో నాయబ్ తాసిల్దార్ రవికుమార్ భూభారతి సదస్సులో పాల్గొన్నారు అవల్గావ్ గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు దీన్ని సద్వినియం చేసుకోవాలని ఎంఆర్ఓ వెల్లడించారు. అవల్గావ్ గ్రామంలో భూభారతి సదస్సులో 46 దరఖాస్తులు వచ్చినాయని తెలిపారు.అలాగే కోడిచ్చిర గ్రామంలో 63 దరఖాస్తులు వచ్చాయి మొత్తము109 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు, అదేవిధంగా శుక్రవారం నాడు 6-6-2025 న సుల్తాన్ పేట్ మరియు హాజీపూర్ మరియు లచ్చన్ గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ కోరారు
