

జనం న్యూస్ :5 జూన్ గురువారం;
సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ఎన్ సి సి యూనిట్ ఆధ్వర్యములో 9 తెలంగాణ ఎన్ సి సి బెటాలియన్ఆదేశాల మేరకు నిర్వహించిన పర్యావరణ దినోత్సవ ప్రోగ్రామ్ కి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భభంగా ఆయన పర్యావరణం గురించి ఎన్ సి సి క్యాడెట్లకు విలువైన సమాచారం అంది అందించారు. పర్యావరణం మరియు ప్రకృతి మనకు, సకల జీవకోటికి, భావి త రాలకు ఎంత ముఖ్యమో ఉదాహరణలతో వివరించిచారు. యూనిఫాం ధరించినప్పుడు వచ్చే ఆత్మవిశ్వాసం, సేవా తత్పరతను పునికిపుచ్చుకోని ఈఈ పర్యావరణ పరిరక్షణ కి నవ సైనికులై సమాజాన్ని ముందుకు నడపాలని అభిలషించారు. కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డా. గోపాల సుదర్శనం మాట్లాడుతు మనం ఈ రోజు తెస్సుకునే చిన్న చిన్న రక్షనాత్మక నిర్ణయాలు సకల మానవాలి భవిష్యత్తుకి పునాది రాళ్లని పిలుపునిచ్చారు. కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్ డా. పిట్ల దాస్ మాట్లాడుతు ఎన్ సి సి క్యాడెట్లు రేపటి నవ సమాజ నిర్మాణానికి రథసారథిలని , ఎన్ సి సి క్యాడెట్లు స్వతహాగ చక్కటి క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి మిగిలిన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చుటకు మార్గదర్శకులుగా ఉండాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమములో కళాశాల ఎన్ సిసి కేర్ టేకర్ బి కృష్ణయ్య, ఎన్ సి సి క్యాడెట్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.