Listen to this article

జనం న్యూస్,జూన్05,అచ్యుతాపురం:

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఇచ్చే 2024-25 ప్రతిభ అవార్డుకు అచ్యుతాపురం లోని కైట్స్ జూనియర్ కళాశాల విద్యార్థిని పి సుప్రియకు లభించిందని కాలేజీ యాజమాన్యం వారు గురువారం తెలిపారు. ఇంటర్ ఎంపీసీ గ్రూప్‌లో 1000 మార్కులకు 988 మార్కులతో బీసీ కేటగిరీలో ప్రతిభ అవార్డు సాధించడం జరిగిందని,రూ 20 వేలు మరియు గోల్డ్ మెడల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుందని, ప్రతిభ అవార్డుకు ఎంపికైన సుప్రియను కళాశాల కరస్పాండెంట్ రెడ్డి చిరంజీవి,డైరెక్టర్లు రెడ్డి గణేష్,ప్రసాద్,శంకరరావు మరియు అధ్యాపక బృందం అభినందించారు.