

జాతీయ పర్యావరణ దినోత్సవం ను పురస్కరించుకొని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన జిల్లా పోలీసులు
జనం న్యూస్ జూన్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా సుమారు 300 మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పి చిత్తరంజన్, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎఎస్పీ గారు మాట్లాడుతూ… పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకొని ఈ రోజు మొక్కలు నాటామని తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా రేపటి తరానికి మంచి చేసిన వారు అవుతారని తెలియజేశారు. ఈరోజు మీరు నాటే ప్రతి మొక్క ప్రతిఫలం భావితరాలకు అందుతుందని తెలియజేశారు. కేవలం చెట్లు మాత్రమే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మనకు మంచి చేస్తాయని తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం, భవిష్యత్ తరాలకు మంచి చేయడం కోసం చెట్లను నాటాలని మరియు నాటిన ప్రతి మొక్కను పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సిఐ లు , ఆర్.ఐ.లు , ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.