Listen to this article

బేస్తవారిపేట వై-జంక్షన్ లో మేఘన హోటల్ అధినేత.

పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన టౌన్నాయకులు యాలం..

ప్రతి సంవత్సరం చేయూత మిత్ర మండలి ఆధ్వర్యంలో..బేస్తవారిపేట లో ఏర్పాటు చేసిన గుంటూరు కాకాని
ఉచిత కంటి వైద్య శిభిరం..మండలంలో కంటి వైద్య శిబిరానికి వచ్చే ప్రజలకు యాలం వెంకటేశ్వర్లు
ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం.

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జూన్ 06 (జనం న్యూస్):

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన టౌన్ నాయకులు యాలం.వెంకటేశ్వర్లు, పార్టీ ఆవిర్భావ మొదటి నుంచి బేస్తవారిపేట పట్టణంలో విశేష కృషి చేసి, టౌన్ లో మంచి నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న యాలం.. ప్రస్తుతం టౌన్ లో అందరిని కలుపుకుంటూ, పార్టీకి సేవలు చేస్తూ, తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.., ప్రస్తుత బేస్తవారిపేట వై-జంక్షన్ లో మేఘన హోటల్ అధినేతగా వున్న యాలం, బేస్తవారిపేట టౌన్ లో తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించినాడు.. మర్రి ముఖ్యంగా ముత్తుముల అశోక్ రెడ్డి భారీ విజయములో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, అశోక్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా, బేస్తవారిపేట టౌన్ లో విస్తృత స్థాయి,పరిచయాలు వున్న వ్యక్తి గా,సౌమ్యుడు గా,వివాద రహితుడిగా,అన్ని అర్హతలు వున్న వ్యక్తి, మేఘన హోటల్ అధినేత యాలం వెంకటేశ్వర్లు.. ఇటువంటి వ్యక్తులకు పార్టీలో వున్నతమైన స్థానం కల్పించి టీడీపీ బేస్తవారిపేట పట్టణ అధ్యక్ష పదవి వరించి నట్లయితే పార్టీకి సేవలు చేసినందుకు గుర్తించినట్లుగా, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు,అందరు వించనున్నారు. పెద్దలు టీడీపీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ, ఇంచార్జీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్న ఆశీస్సులు మెండుగా వున్న వ్యక్తి,కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో వుండే వ్యక్తిగా,అన్ని అర్హతలు వున్న వ్యక్తి కి ఇవ్వడం సముచితం.. ఈ సందర్భంగా బేస్తవారిపేట ప్రజానీకం మొత్తం టీడీపీ బేస్తవారిపేట టౌన్ పట్టణ అధ్యక్షుడిగా అన్ని విధాలుగా అర్హుడు అని తేల్చి చెప్పడం శుభసూచకం.