

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ డిమాండ్
జనం న్యూస్,జూన్06,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం కృష్ణాపురం సమీపంలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ యూనిట్- 2 దుస్తుల పరిశ్రమకు చెందిన బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో నలుగురిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మిగిలిన వారిని అచ్యుతాపురం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము డిమాండ్ చేశారు. అచ్యుతాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో 30మంది మహిళా కార్మికులు గాయాలపాలయ్యారని..వీరందరూ పూర్తిగా కోలుకునే వరకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, కండిషన్ లేని బస్సు నడపడమే ప్రమాదానికి కారణమన్నారు.