

బిచ్కుంద జూన్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం గుండె నెమలి గ్రామంలో నాయబ్ తాసిల్దార్ భారత్ భూభారతి సదస్సులో పాల్గొన్నారు బండా రేంజర్ గ్రామంలో గిర్ధవర్ రవీందర్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు దీన్ని సద్వినియం చేసుకోవాలని నాయబ్ తాసిల్దార్ భరత్ వెల్లడించారు. గుండె నెమిలి గ్రామంలో భూభారతి సదస్సులో 51 దరఖాస్తులు వచ్చినాయని తెలిపారు.అలాగే బండ రేంజర్ గ్రామంలో 31 దరఖాస్తులు వచ్చాయి మొత్తము82 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని మండల నయాబ్ తాసిల్దార్ తెలిపారు, అదేవిధంగా సోమవారం నాడు 9 -6-2025 న గుండె కల్లూరు మరియు మిషన్ కల్లాలి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నయాబ్ తాసిల్దార్ కోరారు