Listen to this article

జనం న్యూస్ జూన్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భూ భారతి కార్యక్రమంను నిర్వహిస్తున్నదని,
భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం బరకత్ గూడెం గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు.రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 20 వరకు మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సు నిర్వహించి భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.రైతులు రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకుంటే భూ భారతి చట్టం ద్వారా పరిష్కరిస్తామన్నారు.