Listen to this article

జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )మార్కుక్ మండల పరిధి లోని అన్ని ప్రాథమిక, ప్రాథమిక్కోనత, ఉన్నత పాఠశాలలు తేది 7వ తేదీన ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బడిబాట కార్యక్రమం గురించి గ్రామ సభ ఏర్పాటు చేయబడినది. అందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామము లో అందరు ప్రముకులు, తల్లిదండ్రుల పాల్గొనిప్రభుత్వ బడికి తమ పిల్లలను పంపడానికి ప్రతిజ్ఞ చేశారు. 7వ తేది రోజు ఉదయం 7 గంటల నుంచి బడిబాట కార్యక్రమం ప్రచారం జరుగుతుంది. మంచి స్పందన వచ్చింది. మండల విద్యాధికారి వెంకట రాములు, గంగాపూర్ లో పాల్గొని మూసివున్న పాఠశాల తెరిపించుటకు గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసినారు. మంచి స్పందన వచ్చింది. గణేశ్ పల్లి లో గ్రామ పెద్దలు ఈ సారి సంఖ్య 30 వరకు పెంచుటకు తీర్మానం చేశారు. అన్ని పాఠశాల లో మంచి స్పందన ఉంది.ఈ సారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఇట్టి కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేసుకుందాం అని తెలిపారు.