Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ లేదా ఈద్ అల్-అధా అరవపల్లి మరియు నాగి రెడ్డిపల్లి గ్రామ జామియా మసీద్ ప్రాంగణంలో ఉన్న ఈద్గా నందు ప్రత్యేక ప్రార్థ నలతో ఈ సద్దులతో ప్రారం భమై ప్రత్యేక ప్రార్థనలతో ముగిసినది , ముస్లింలకు చాలా ముఖ్యమైన పండుగ. ఇది అల్లాహ్ పట్ల ప్రవక్త ఇబ్రహీం చేసిన అపారమైన విశ్వాసం మరియు త్యాగం యొక్క గుర్తుగా జరుపు కుంటారు. ఈ పండుగ విశ్వాసం,దాతృత్వం మరియు సహనం అనే విలువలను మనకు గుర్తుచేస్తుంది. ఈ పండుగ ముస్లిం సమాజానికి మాత్రమే కాదు, అన్ని మతాలు మరియు జాతులు కలిగిన ప్రజలకు ఒక అద్భుతమైన సందేశాన్ని కలిగి ఉంది, ఇది విశ్వాసం, త్యాగం మరియు దాతృత్వం యొక్క విలువలను మనకు నేర్పుతుంది.అని ముస్లిం సోదరులు తెలిపారు.