

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 100 పడకల హాస్పటల్ గా ఏర్పాటు చేయాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి డిమాండ్.
జనం న్యూస్ 7 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. దేవాదుల ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి రైతన్న ఆదుకోవాలని.. అనేకసార్లు ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు అధికారులకు విన్నవించిన కూడా నిర్లక్ష్యంగా వ్యవహారం జరుగుతా ఉంది దీని ద్వారా రైతాంగానికి రబీ సీజన్లో చివరి ఆయకట్టు రైతన్న కందకుండా నీరు కాలల ద్వారా పోవడం లేదు మధ్య మధ్యలో గండ్లు పడి నీరు వృధాగా పోతుంది. వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవ చూపి శాశ్వత పరిష్కారం చేయాలని సిపిఐ జిల్లా సమితి డిమాండ్ చేస్తుందిఉమ్మడి వరంగల్. కరీంనగర్ .మెదక్ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల దవాఖానగా ఏర్పాటు చేసి ప్రమాదాల గురై. కొద్ది గంటల్లో ప్రాణాలు పోయే చికిత్స అందిస్తే బ్రతికే వారు కానీ దూరంగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఉండడంవల్ల గాలిలో ప్రాణాలు ప్రజలు కోల్పోతున్నారు దీనిని గమనించి ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కి సిపిఐ కార్యకర్తలు నాయకులు దృష్టికి తీసుకపోవడం జరిగింది వెంటనే మంత్రి పొన్నంప్రభాకర్ వంద పడగల దవాఖాన గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారుగత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రభుత్వంలో కొనసాగి ఆరోలైన పేదలు ఇండ్లు లేక దుర్భర జీవితం గడుపుతున్న పట్టించుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమంది వరకే ప్రారంభించి అర్హులైన వారిని..గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పేదవారిని ఆదుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుందిరేషన్ కార్డు లేక దరఖాస్తులు చేసుకున్న వారికి అందరికి అధికారులు కృషి చేయాలని ప్రభుత్వం వెంటనే. రేషన్ కార్డులు మంజూరు చేసి వారిని ఆదుకోవాలి.కేంద్ర ప్రభుత్వం ఇటీవల . కగార్…పేరుతో మావోయిస్టులను ఏరివేస్తామని ఎన్కౌంటర్ల ద్వారా చంపడంతో. మావోయిస్టులు స్వయంగా శాంతి చర్చలు జరపాలని కోరగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు అనేకమంది ఎన్కౌంటర్లో చనిపోతావున్నారు.. సిపిఐ పార్టీ . కగార్ వెంటనే ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని..సిపిఐ కోరుతుందిదేశ స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ ధనవంతులు ధనవంతులుగా మారిపోతున్నారు పేదవాడు మరింత పేదవాడుగా తరతన్యాలకు కొనసాగుతా ఉన్నాయి దారిద్ర దిగవరేఖకు సుమారు 30% నుండి 40% వరకు ప్రజల రెండు పూటల భోజనం లేక దుస్థితిలో.జీవిస్తున్నారు విద్యా వైద్యం పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో చేతుల్లోకి వెళ్లిపోయింది.విద్యను వైద్యమును కొనుక్కునే దిశగా దేశంలో దాపురించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ చేసిన వాటిని లాభాల్లో ఉన్న సంస్థలను కూడా కార్పొరేట్ రంగానికి కట్ట పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ప్రజల సంక్షేమాన్ని మరిచిపోయి జాతీయవాదం పేరుతో ప్రజలను దేశ.పౌరులను విభజించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు భారత రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా కొనసాగ లేదని భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని లౌక్యవాదాన్ని కాపాడ కోసం ప్రజలు ఐక్యతను చాటాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉట్కూరి రాములు,జిల్లా కౌన్సిల్ సభ్యులు మర్రి శ్రీనివాస్, మండల కార్యదర్శి శనగరపు రాజకుమార్, సహాయ కార్యదర్శి గడ్డం రాజనర్సు, సిపిఐ మండల నాయకులు తండ ముండయ్య,బొంత మల్లయ్య, ఆరేపల్లి చంద్రమౌళి,కర్రే రామస్వామి,మిట్టపల్లి ఆనందం,తదితరులు పాల్గొన్నారు