


మావోయిస్టులతో చర్చలు జరపాలి
వామపక్ష నేతల డిమాండ్
సిద్దిపేట లో వామపక్ష పార్టీలు,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన
జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)ఛత్తీస్ ఘడ్ లో బిజెపి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేర సాగిస్తున్న నరమేధాన్ని వెంటనే నిలుపుదల చేసి కాల్పుల విరమణను ప్రకటించాలని,తక్షణమే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని వామపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు..శనివారం రోజున కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను ఆపివేయాలని,మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ లో సిపిఐ,సీపీఎం,ఇతర వామపక్ష,ప్రజా ఫ్రంట్,పౌర సంఘాల,దళిత,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది..ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, ప్రజాఫంట్ అధ్యక్షులు సత్తయ్య, సీఎల్ సి నాయకులు శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు భీం సేన లు మాట్లాడుతూ గత కొన్ని 18 నెలలుగా మధ్య భారత అడవుల్లో భారత ప్రభుత్వం “ఆపరేషన్ కగార్” పేరుతో హత్యాకాండను కొనసాగిస్తుందని,ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ లో ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 25కి పైగా మృతి చెంది 15 రోజులు గడవక ముందే సిపిఐ మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ను కేంద్ర మిలిటరీ బలగాలు నిన్న హత్య చేశాయని వారు అన్నారు. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరిందని, ఆపరేషన్ కగార్ ని ఆపివేయాలనీ, మేధావులు, ప్రజాస్వామిక వాదులు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు, అయినా కూడా నరేంద్రమోడీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పట్టిచ్చుకోవడం లేదని అన్నారు.పైగా నరమేధాన్ని తీవ్రతరం చేసిందని,రోజూ ఈ దేశ పౌరులను హత్యలు చేస్తూ పోతుందని,అడవి నుండి ఆదివాసీలను ఖాళీ చేయించి,అడవి సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని విమర్శించారు. ఒకవైపు ఆదివాసీలను మావోయిస్టు నాయకులను హత్య చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరొకవైపున చత్తీస్గడ్, మహారాష్ట్ర, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లోని అటవీ సంపదను, ఖనిజాలను కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని విమర్శించారు,నంబాళ్ళ కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన తెల్లారే 1000 హెక్టార్ల అటవీ భూమిని కార్పొరేట్ శక్తులకు మైనింగ్ కోసం కేటాయించారని, లక్షా 23 వేల చెట్లను కొట్టివేయడానికి వారికి అనుమతులు ఇచ్చారని విమర్శించారు.భారత దేశ పొరుగు దేశమైన పాకిస్థాన్ తో యుద్ధం చేసే సమయంలో అగ్ర రాజ్యమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాళ్ళ కింద భారత దేశ ఆత్మ గౌరవాన్ని మోడీ తాకట్టు పెట్టి ఉగ్రవాదులతో,పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న ప్రభుత్వం 50 ఏళ్ల నుండి ఈ దేశంలో అంతరాలు లేని సమాజం కోసం,ఆదివాసీల పక్షాన పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలు జరపకపోవడం కేవలం సామ్రాజ్య వాదులతో స్నేహం చేయడానికె అని అర్ధం అవుతుందని మండిపడ్డారు.. ఆపరేషన్ కగార్ ని వెంటనే నిలిపివేసి, బలగాలను వెనక్కి రప్పించాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిలచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ నరమేధాన్ని ప్రజలూ, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు..ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్,కనుకుంట్ల శంకర్,గజాభీమకర్ బన్సీలాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాలస్వామి,రాళ్లబండి శశిధర్,గొడ్డుబర్ల భాస్కర్,సీపీఐ జిల్లా నాయకులు జేరిపోతుల జనార్దన్,కర్ణాల చంద్రం,రామగళ్ల నరేష్,మిట్టపల్లి సుధాకర్,బెక్కంటి సంపత్,కానుగుల రమణాకార్,సీపీఎం కొంగరి వెంకట్ మావో,అమ్ముల బాలనర్సయ్య,దాసరి ప్రశాంత్,రవీంద్ర చారి,రంజిత్ రెడ్డి,అభిరాం,పివైఎల్ నాయకులు అనిల్,విజయ్ లు తదితరులు పాల్గొన్నారు..