

జనం న్యూస్ జూన్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని మైలారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నే నాణ్యమైన విద్య ఉంటుంది అని ఎం ఈ వో గడ్డం బిక్షపతి అన్నారు విద్యార్థుల ఇంటింటి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతుల గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌందర్యాలు కలిగి ఉంటాయి అని అనుభవజ్ఞులైన టీచర్లు ఉపాధ్యాయులు ఉంటారని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫారంలు మధ్యాహ్నం భోజనం అందించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మనోజ్ కుమార్ నాగ సుభాషిని ఉపాధ్యాయులు రమేష్ అరుణ్ టీచర్లు సంధ్యారాణి సీఆర్పీ అశోక్ వి వో ఏ జ్యోతి తదితరులు పాల్గొన్నారు…