

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలో బక్రీద్ వండగ హిందూ-ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి
మత విద్వేషాలు, ఘర్షలు, అల్లర్లు జరగకుండా రంజాన్ ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూన్ 7న తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – జిల్లాలో బక్రీద్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలిచ్చాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. బక్రీద్ పండగను దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, భద్రత ఏర్పాట్లును సంబంధిత పోలీసు అధికారులు సిసి కెమెరాలు, డ్రోన్స్ తో పర్యవేక్షించారు. మసీదుల వద్ద ప్రార్ధనలకు విచ్చేసిన ముస్లిం సోదరులకు హిందూ సోదరులు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు. కొన్ని మసీదుల వద్ద హిందువులు, ముస్లింలు సోదరభావంతో ఒకరినొకరు అలింగనం చేసుకొని, శుభాకాంక్షలు తెలుపుకొన్నారన్నారు. పట్టణంలో ముఖ్యమైన మసీదుల వద్ద డ్రోన్స్ నిఘా ఏర్పాటు చేసి, ప్రార్ధనలకు వచ్చే ముస్లిం సోదరుల వాహనాల వలన ఎటువంటి ట్రాఫిక్కు ఇబ్బందులు
తలెత్తకుండా పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
భారత దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనమని, బక్రీద్ పండగ రోజున హిందూ-ముస్లిం సోదరులు ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకొంటూ, శుభాకాంక్షలు తెలుపుకొంటూ మతసామరస్యానికి, విశ్వాసానికి ప్రతీకగా
నిలిచారని వకుల్ జిందల్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మసీదుల వద్ద సంబంధిత పోలీసు అధికారులు, సిఐలు భద్రత విధులు నిర్వహించగా, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యా రెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించారు.