

జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఆవులు, దూడలు, ఓంటెల వధ నిషేధమని, ఇది చట్టరిత్యా నేరమని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వైవీ.రమణ హెచ్చరించారు. ఉల్లంఘించినవారిపై జంతుహింస నివారణ చట్టం -1960, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం -1977ల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఎక్కడైనా పశువుల వధకు పాల్పడిన, అక్రమ రవాణా చేసినా100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.