Listen to this article

జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఆవులు, దూడలు, ఓంటెల వధ నిషేధమని, ఇది చట్టరిత్యా నేరమని పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ.రమణ హెచ్చరించారు. ఉల్లంఘించినవారిపై జంతుహింస నివారణ చట్టం -1960, ఆంధ్రప్రదేశ్‌ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం -1977ల ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఎక్కడైనా పశువుల వధకు పాల్పడిన, అక్రమ రవాణా చేసినా100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.