Listen to this article

జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఇల్లెందుల శ్రీనివాస్ అన్నారు,సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్యవైశ్య నాయకులు అయ్యప్ప ట్రేడర్స్ అధినేత ఇల్లెందుల శ్రీనివాస్ దంపతులు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం లో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని,సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు,అందరూ బాగుండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు