Listen to this article

అమలాపురంలో జిల్లా కార్యశాల సమావేశం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ

, జనం న్యూస్ జూన్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముమ్మిడివరం గేట్ దగ్గర సత్యనారాయణ విలాస్ నందు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ అదబాల సత్యనారాయణ అధ్యక్షతన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 11 సంవత్సరాల మోడీ గార్ సుపరిపాలన, పర్యావరణ దినోత్సవం, జూన్ 21 యోగా దినోత్సవం: జూన్ 21 డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్, 50 సంవత్సరాల క్రితం అనగా జూన్ 25 ఇందిరా గాంధీ నేతృత్వంలో ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజులు తదితర అంశాలు ప్రజల వద్దకు తీసుకుని వెళ్లడానికి జిల్లా కార్యశాలకి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ గారు హాజరై వారు మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా ప్రధాని సరేంద్ర మోడీ గారు దేశ సంక్షేమమే ధ్యేయంగా వికసద్భారత లక్ష్యంగా చేస్తున్న కృషిని ప్రజా సంక్షేమ పథకాలు ప్రపంచ దేశాలలో భారతదేశానికి విశ్వ గురువుగా నిలవడానికి చేస్తున్న కృషి, యోగ అవశ్యకతను తెలియజేశారు కార్యకర్తలకు జూన్ 5వ తారీఖు నుండి ఆగస్టు 5వ తారీఖు వరకు ప్రపంచ పద్యావరణ దినోత్సవాన్ని విస్తృతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాబ్ వేను, జిల్లా ఇంచార్జ్ పొట్లూరు రామ్మోహన్రావు, కిసాన్ మోర్చా కార్యవర్గ జాతీయ కార్యవర్గ సభ్యుడు సల్లా పవన్ కుమార్ పదకొండ సంవత్సరాల మోడీ పాలన యోగ డే చేశారు డే గోదావరి జోనల్ ఇంచార్జ్ ఎస్ లక్ష్మీప్రసన్న చేయవలసిన కార్యక్రమాలను ఉద్దేశిండి నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరు సత్యానందం, జిల్లా పరిశీలకులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, మోకా వెంకట సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వీకురుమెట్ల శ్రీనివాసరావు, మహిళా నేతలు ఆకుమర్తి బేబీ కాణి, యనమదల రాజ్యలక్ష్మి, చిట్టూరి రాజేశ్వరి, చిలకమర్రి కస్తూరి, మోడా ఆదిలక్ష్మి, జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు