Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 09 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పట్టణం వన్ టౌన్, టూ టౌన్ పోలీసు స్టేషను పరిధిలోని శివారు ప్రాంతాల్లో జూన్ 7న ఓపెన్ డ్రింకింగు చేస్తున్న వారిపై పోలీసులు డ్రోన్స్ సహాయంతో రైడ్స్ నిర్వహించి, ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని, వారిపై ‘ఓపెన్ డ్రింకింగు’ కేసులు నమోదు చేసారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – విజయనగరం 1వ, 2వ పట్టణ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలోని పూల్బాగ్ కాలనీ నందిగుడ్డి ప్రాంతంలోను, 1వపట్టణ పోలీసు స్టేషను పరిధిలోని కనపాక, అయ్యన్నపేట ఏరియాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై డ్రోన్ను పంపి, ఆయా ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్నట్లుగా గుర్తించి, రైడ్స్ నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. వన్ టౌన్ పోలీసు స్టేషను వరిధిలో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై ఆరు కేసులు, టూ టౌన్ పోలీసు స్టేషను పరిధిలో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై 11 కేసులను నమోదు చేసామన్నారు. పేకాట, ఓపెన్ డ్రింకింగు, ట్రాఫిక్ రెగ్యులేషను, జాతర్లు, దర్నాల నిర్వహణలో అనుమానస్పద వ్యక్తుల ఆచూకీని కనిపెట్టేందుకు డ్రోన్ వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్ ను వినియోగించాలని, శివారు ప్రాంతాలపై నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.