Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలం లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నందలూరు కన్యకా చెరువు మరియు చెరువు అలుగు వద్ద ఉన్నటువంటి గంగమ్మ దేవాలయం ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది.
ఈ పరంపరలో భాగంగా హరిత గ్రామమే లక్ష్యంగా లయన్స్ మరియు వాకర్స్ క్లబ్ సభ్యులు సమిష్టిగా శ్రమదానంతో మరిన్ని మొక్కలను నిన్న మరియు ఇవాళ అరవపల్లి జిల్లా పరిషత్ మైదానం చుట్టూ నాటడం జరిగింది, అలాగే మొక్కలు నాటడం కొరకు గుంతలు తీయుటకు ఎర్త్ అగర్ మిషన్ ను డాక్టర్ బచ్చు జయ భాస్కరరావు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బచ్చు జయ భాస్కరరావు, మన్నెం రామమోహన్. SI, లయన్ కుర్రా మణి యాదవ్, ఉప్పు శెట్టి సుధీర్, మోడపోతుల రాము, శ్యామన బోయిన గురు ప్రసాద్,కొత్తపల్లి రాజాచారి, జంగం శెట్టి హరి, గంధం గంగాధర్,గండికోట కృష్ణ కుమార్,యంబులూరు ప్రదీప్ మన్నెం చరణ్,సాయి చరణ్, రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.