Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 9)

దౌల్తాబాద్ మండలంలోని శేరిపల్లి బందారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో మండల విద్యాధికారి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి పేద విద్యార్థికి అందాలి అదేవిధంగా నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన అనేది ప్రభుత్వ పాఠశాలలోనే అందుతుంది కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు అనంతరం పాఠశాల గోడపత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నవీన్ వెంకట్ రెడ్డి ఉపాధ్యాయులు అమల కవిత క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాజు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.