Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

MSF టౌన్ అధ్యక్షులు కలపాల చరణ్ మాదిగ కాప డేనిల్ మాదిగ MSF టౌన్ ఉపాధ్యక్షులు


బుట్టి మహేంద్ర మాదిగ, MSF ప్రధాన కార్యదర్శి వీళ్ళ ఆధ్వర్యంలో,ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశం,

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పల్నాడు జిల్లా కో ఇన్చార్జి పాల్గొని మాట్లాడుతూ,
సామాజిక , ఆర్థిక, రాజకీయ అసమానతలను నిర్మూలించి సమానత్వాన్ని సాధించడమే ఎమ్మార్పీఎస్ ఆశయం. సమాజ మద్దతుతో సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం నడిపి విజయం సాధించాం.. ఇగ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం నిబద్ధతతో నిలబడదాం. భారతదేశంలో అంబేద్కర్ ఉన్నప్పటి నుండి ఇంకా మిగిలి ఉన్న సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తాం. MRPS 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలి. ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా కో ఇన్చార్జి చిరుగూరి నాగరాజు మాదిగ , :- సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణం కాంక్షిస్తూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని, మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సారధ్యంలో దేశవ్యాప్తంగా పాలకులు పట్టించుకొని సమస్యలను గుర్తించి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం MRPS ఉద్యమిస్తుందని ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా కో ఇన్చార్జి చిరుగూరి నాగరాజు మాదిగ అన్నారు. మాదిగలతో కలిసి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ మాదిగ సమాజానికి దక్కవలిసిన రిజర్వేషన్ హక్కుల కోసం పోరాడుతూనే మరోవైపు నిరాదరణకు గురైన వర్గాలైన వికలాంగుల వృద్దులు వితంతువుల కోసం పోరాడి వారికి పెన్షన్లు సాధించడం జరిగింది. గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ పథకం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, మహిళ భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, తెల్ల రేషన్ కార్డు ప్రజలకు 6 కిలోల బియ్యం పెంపు మొదలగు ఫలితాలను ఎమ్మార్పీఎస్ సాధించిందని అన్నారు. ఈ ఫలాలు కేవలం మాదిగల కోసం చేసినవి కావని , అన్ని వర్గాల సంక్షేమం సామాజిక బాధ్యతతో చేసిన ఉద్యమలని అని అన్నారు. కాబట్టి సమాజ హితమే ధ్యేయంగా ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని అన్నారు. సమాజ మద్దతుతో సుదీర్ఘ కాలం పాటు ఉద్య మం నడిపి విజయం సాధించాంఇగ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం నిబద్ధతతో నిలబడతామని, స్వాతంత్రం వచ్చి 67 ఏళ్లు గడుస్తున్నా, ప్రజల సమస్యలు పేదల బాధలు ఎక్కడ అక్కడనే మిగిలిపోయి ఉన్నాయని, అందుకే అంబేద్కర్ ఉన్నప్పటి నుండి మిగిలిన సమస్యలపై ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం, ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమిస్తామని అన్నారు కనుక వర్గీకరణ సాధించిన నేపథ్యంలో సమాజానికి కృతజ్ఞతగా భవిష్యత్ ఉద్యమ కార్యాచణతో ముందుకు సాగుతామని, మాదిగల కోసం ముప్పై ఏళ్లుగా జరిగిన రాజీలేని పోరాటం విజయవంతమై తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. ఈ విజయానికి కారణం ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు అందించిన సహకారమే అని అన్నారు. దేశంలో ఎన్నో కుల ఉద్యమాలు పుట్టినప్పటికీ లక్ష్యం సాధించే వరకు ఏ ఉద్యమం నిలబడలేకపోయాయి కాని ఎమ్మార్పీఎస్ మాత్రమే సజీవంగా నిలబడి లక్ష్యం చేరిందని దానికి సమాజం ఇచ్చిన సహకారమే ప్రధాన కారణమని అన్నారు. ఈనేపథ్యంలో ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోదాల విజయ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు బూదాల కిరణ్ మాదిగ మాదిగ విద్యార్థి నాయకులు షేక్ తాజున్ ఎమ్మార్పీఎస్, మైనార్టీ నాయకులు కండ్లకుంట పార్ధు మాదిగ విద్యార్థి నాయకులు
పేరు బోన రామకృష్ణ ముదిరాజులు వేముల వరప్రసాద్ మాల, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు