

జనం న్యూస్: 9 జూన్ సోమవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకై ఏర్పడిన మొట్టమొదటి సంఘము రాష్టోపాధ్యాయ సంఘం అని జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్ అన్నారు. ఎస్టియు 79వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పిఎస్ డబ్యు ఏ భవన్ లో పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన ఎన్నో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేసిందని, ప్రస్తుతం కూడా ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సంఘం ఎల్లప్పుడూ పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్, ఐతా అంజయ్య, మధుసూదన్, ఉండ్రాళ్ల రాజేశం, రాచకొండ భూపాల్, కలకుంట్ల రాములు, భూమయ్య, ఆకుల హరిదాస్, బాలకిషన్, సిల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు