Listen to this article

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి.

ఎంఈఓ రహీమొద్దీన్, ఎంపీడీవో సత్తయ్య,

జనం న్యూస్,జున్ 09,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్ అంగన్వాడి కేంద్రం వీధుల్లో తమ పిల్లలకు మా ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పించాలని సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాను నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు అందించడానికై అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటుచేసి నిరుపేద విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పాటు, నాణ్యతతో కూడిన విద్యాబోధనతో రెండు జతల బట్టలు, పాఠ్యపుస్తకాలు కాపీలను,అందిస్తుందని అన్నారు.ప్రైవేటు పాఠశాలలకు దిటుగా విద్యా బోధనను అందించబడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో సుభాష్,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యశ్వంత్,కిఫాయత్ అలీ,శివా రెడ్డి,కీర్తి కుమార్,రాజ్ కుమార్, రాహుల్,గ్రామ యువజన నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సంఘరామ్, తదితరులు పాల్గొన్నారు.