

జనం న్యూస్ జూన్ 10 ( ముమ్మిడివరం ప్రతినిధి )
నరేంద్ర మోదీ, ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజానగరం కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి,మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా సోమవారము బిజెపి కార్యవర్గ సమావేశం నిర్వహించామని అన్నారు. నేరేంద్ర మోదీ, హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి వ్యక్తికి ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా చేరుతున్నాయని అన్నారు. అన్నదాతలకు అండగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించిందని అన్నారు.భారత్ ను విశ్వగురువుగా తీర్చిదిద్దే క్రమంలో మోదీ, అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రతి బీజేపీ కార్యకర్త అండగా ఉండాలని వీరన్న చౌదరి అన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సేవ , సుపరిపాలన , పేదల సంక్షేమ పాలన అట్టడుగు వర్గాల జీవితాలను మారుస్తుంది. జన్ ధన్ నుండి ఆవాస్ వరకు, ముద్ర నుండి ఆయుష్మాన్ భారత్ వరకు – ప్రధాన పథకాలు భారతదేశంలోని పేదలకు ఆర్థిక చేరిక, గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ మరియు జీవనోపాధితో సాధికారత కల్పించాయి. ఈ కార్యక్రమాలు గ్రామీణ మరియు పట్టణ భారతదేశంలో నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికాయి. డిజిటల్ సంస్కరణలు, సామాజిక భద్రతా కవరేజ్ మరియు లక్ష్యంగా ఉన్న సంక్షేమం జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా లక్షలాది ఉద్యోగాలను సృష్టించాయి, క్రెడిట్ యాక్సెస్ను విస్తరించాయి, మహిళల భాగస్వామ్యాన్ని కల్పించారు పత్రికా విలేకరులకు తెలియపరిచారు