

జనం న్యూస్ జూన్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
భూ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తుందని భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలను పరిష్కారమవుతాయని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని కలకోవా గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు..గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సమస్యలను దరఖాస్తు రూపంలో సమర్పించాలని, అధికారులు తప్పకుండా సమస్యలు పరిష్కరం చేస్తారని తెలిపారు.
