Listen to this article

జనం న్యూస్ జూన్ 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో


భూ సమస్యల పరిష్కారానికి భూభారతి పథకంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వాంకిడి నాయబ్ తహసీల్దార్ రామ్ లాల్ అన్నారు. సోమవారం వాంకిడి మండలం ఖమన గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుండి భూ సమస్యలపై వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. రెవెన్యూ సదస్సులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ సదస్సులో వాంకిడి ఆస్ఐ అబ్దుల్ మజీద్, రెవెన్యూ ఉద్యోగులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు