Listen to this article

జనం న్యూస్ జూన్ 9 :గొలుగొండ మండలం విలేఖరి పొట్ల రాజా

గొలుగొండ మండలం లో ఉన్న గ్రామాల్లో పలు గ్రామాల్లో మొన్న కురిసిన వర్షాల కారణంగా ప్రజలు జ్వరాలకు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఉద్దేశించుకొని ఆ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు దగ్గరుండి వాటర్ ట్యాంకులు క్లీనింగ్ చేయించాలి. అలాగే డ్రైనేజీ కాలవలు క్లీనింగ్ చేయించి బీచింగు జల్లించాలి. ఇలా చేస్తే దోమలు ప్రజలను కుట్టకుండా ప్రజలు నీరసాల బారిని పడకుండా ఉంటారు. ఇది ఉద్దేశించుకొని వెంటనే పంచాయతీ కార్యదర్శిలు పట్టించుకోవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.