

మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్
జనం న్యూస్ జూన్ 10 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో మున్నూరుకాపు వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకు శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాజాగా మంత్రి వర్గ విస్తరణలో కాంగ్రెస్ సీనియర్ నేత, వేములవాడ శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కు మంత్రి పదవి ఇవ్వకపోవడం రాష్ట్రంలో మున్నూరుకాపు వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నామన్నారు. నిబద్దత,నిజాయితీ గల మున్నూరుకాపు బిడ్డ ఆది శ్రీనివాస్,ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా మంత్రి వర్గంలో చోటు ఇవ్వకుండా తప్పు చేసిందన్నారు. వైఎస్ రాజశేకరెడ్డి,కి ప్రియ శిష్యుడిగా కాంగ్రెస్ పయనాన్ని ప్రారంభించిన ఆదిశ్రీనివాసు,ను విస్మరించడం ప్రభుత్వానికి సరికాదన్నారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా ఉంటున్న మున్నూరుకాపు వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. చాలా బాధకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరుకాపు వర్గంలో తీవ్ర చర్చ కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్కు త్వరలో మున్నూరుకాపులు తగిన నిరసన తెలుపుతామన్నారు. తెలంగాణలో మున్నూరుకాపులు ఒక శక్తివంతమైన బీసీ సామాజిక వర్గంతో, లక్షలాది మందిని ఉన్న ఈ వర్గానికి మంత్రి వర్గంలో ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవడం చాలా బాధకరమన్నారు. అన్ని అర్హతలు ఉన్న ఆది శ్రీనివాస్,కు మంత్రి వర్గంలో చోటు కల్పించకుంటే మున్నూరుకాపులు సునామిలో పెద్ద ఎత్తున నిరసనలు తప్పవన్నారు. ఇప్పటికైనా ఆయనికి న్యాయం చేసి మంత్రి వర్గంలో చోటు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెట్టి గాడి అంజయ్య, కోశాధికారి కుంటి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.