Listen to this article

జనం న్యూస్,జూన్10,అచ్యుతాపురం

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామంలో సెజ్ రెండో విడతలో భాగంగా సేకరించిన భూముల్లో 105 ఎకరాలు యాక్షన్ తేసా కంపెనీకి కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో ఈరోజు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.200 కోట్లు పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ కంపెనీలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 3,000 మంది నుంచి 4,000 మంది వరకు ఉపాధి కలుగుతుందని,సకాలంలో నిర్మాణం పూర్తి చేసి సెజ్ నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ యాజమాన్యం,అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.