Listen to this article

జనం న్యూస్ 10 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

చదువు, కుటుంబం, కెరీర్‌తో పాటు పిల్లలకు మంచి నడవడిక ముఖ్యమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలో జరిగిన షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల ప్రధానోత్సవంలో సోమవారం ఆమె పాల్గొన్నారు. మొత్తం 158 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20వేలు నగదు చొప్పున చెక్కులు, ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ అందజీశారు. విద్యార్థులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.