

జనం న్యూస్ జూన్ 10 ముమ్మిడివరం ప్రతినిధి
ది. 10-06-2025 బిజెపిరాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి పిలుపు మేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ వారి ఆదేశంతో కాట్రేనికోన మండలంలో , చెయ్యరు పంచాయితీ లో పరిధిలో శ్రీ నరేంద్ర మోడీజీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి 11 సంవత్సరములు అయిన సందర్బంగా దేశం లో జరుగుతున్న సూపరిపాలన గురించి, నరేంద్ర మోడీ వారు అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ముద్ర యోజన పథకం, కిసాన్ సమ్మాన్ నిధి యోజనా పథకం, సుకన్య సమృద్ధి యోజనా పథకం, గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహార పధకం, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పధకం, గరీభి హటావో పథకం ఉచిత రేషన్ బియ్యం పథకం, అసంగిట కార్మికులకు ఇన్సూరెన్స్ పధకం, కరోనా సమయం లో ప్రజలను ఆదుకోవడం, ఉజ్వల ఉచిత గ్యాస్ పథకం లాంటి ప్రజాసంక్షేమపధకాల గురించి ప్రజలకు తెలియజేయడమైనది. సచివాలయం సెక్రటరీ రమణ బిజెపి మండల అధ్యక్షులు మట్ట శివప్రసాద్ బిజెపి నియోజవర్గ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మండల పూర్వ అధ్యక్షులు మట్టా సూరిబాబు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం టీచర్ నూకల స్వాతి ఉప్పల ధనలక్ష్మి మండల సెక్రెటరీ కొత్తలం సురేష్ బీబీవీ నారాయణస్వామి నంద్యాల వెంకన్న బాబు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు,
