

విద్యార్థులను ప్రభుత్వం పాఠశాలకు పంపాలి.
ప్రైవేటు పాఠశాల వద్దు – ప్రభుత్వ పాఠశాల ముద్దు.
జనం న్యూస్ 10 జూన్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ )
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని సుల్తాన్పూర్ తాండ లో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటిని సర్వే చేసి విద్యార్థులను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు, మరియు యువజన సంఘ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూసుఫ్, ఉపాధ్యాయులు మంచనపల్లి శ్రీనివాస్ విద్యార్థులు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.