

జనం న్యూస్ జూన్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని పార్టీ ఉపాధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. ఈ మేరకు సోమవారం పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కేసి వేణుగోపాల్ నుండి ఉత్తర్వులు విలువడ్డాయి. దీంతో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. మూసాపేట్ లోని పార్టీ కార్యాలయంలో నాయకులు రమేష్ ని కలిసి పుష్ప గుచ్చాలు, బొకేలు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. పది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కి నగరంలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా పోయారు.దీంతో పార్టీ తరఫున పోటీ చేసిన వారిని ఇన్చార్జిలుగా అధిష్టానం నియమించింది .దీంతో నియోజకవర్గాల్లో పార్టీకి కొంతమేర జోష్ వచ్చింది. కూకట్పల్లి నుండి పోటీ చేసిన రమేష్ ని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో గంధం రాజు కొప్పిశెట్టి దినేష్ కుమార్ గంధం పృద్వి తదితరులు పాల్గొన్నారు