

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్
జనం న్యూస్ జూన్ 10, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సు సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం దిశగా భూ భారతి చట్టం ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను పరిశీలించి రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వతంగా సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇంటి పేరు, పేరు, తండ్రి పేరు, భూమి విస్తీర్ణం హెచ్చుతగ్గులు, ఇతర వివరాల నమోదుపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.