

కేంద్ర పెట్రోలియం, సహజ వనరులు, గ్యాస్ సంయుక్త కార్యదర్శి వినోద్ శేషన్
జనం న్యూస్ జూన్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
రాష్ట్రంలో అసంపూర్తి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వనరులు, గ్యాస్ సంయుక్త కార్యదర్శి వినోద్ శేషన్ అన్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని గొర్రెగుట్ట, బోర్లకుంట, కొత్మీర్, దహేగాం, హత్తిని తదితర ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించి జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం, సహజ వనరులు, గ్యాస్ సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణలోని అసంపూర్తి ప్రాజెక్టులను పరిశీలించి ఆగిపోవడానికి గల కారణాలు, పూర్తి చేయడానికి చేపట్టవలసిన చర్యలను పరిశీలించి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కాలువలను పరిశీలించడం జరిగిందని, ఆయా గ్రామ శివారులలో నిర్మాణమైన ప్రాజెక్టు కాలువలతో పాటు నిర్మాణం కానున్న కాలువల పరిస్థితులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. పూర్తిచేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రేమోన్ ఎస్ పిళ్ళై, కేంద్ర భూగర్భ జల వనరుల ఈ. ఈ. వెంకటేశ్వర్లు, హెచ్. ఈ. కుమారస్వామి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డి. ఈ. భానుమూర్తి, ఈ. ఈ. ప్రభాకర్, ఎ. ఈ. లు క్రాంతి, సాయి తేజ, తహసిల్దార్ మునావర్ షరీఫ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
