Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 10)

. తేదీ 10/6/2025 రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొమ్మాట మరియు ప్రాథమిక పాఠశాల గాజులపల్లి పాఠశాలలు సంయుక్తంగా గాజులపల్లి గ్రామంలో వీధుల గుండా ప్లకార్డులు, కరపత్రముల ద్వారా గ్రామ కూడళ్ల వద్ద ప్రభుత్వ పాఠశాలల పనితీరు గూర్చిన ఈ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాజులపల్లిల విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో 5వతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను దొమ్మాటలో ఉన్నత పాఠశాలలో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు బాసిత్ కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒత్తిడి లేని విద్య అందుతుందని, విద్యాహక్కు చట్టం ద్వారా అభ్యసన సామర్థ్యాలను పొందడం విద్యార్థుల హక్కుని, ఆ హక్కుకు తాము హామీ పడుతున్నామని,వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, సైన్స్ ల్యాబ్ గ్రంథాలయ సదుపాయాలు కలవని, ఇంటరాక్టివ్ ప్యానల్ ద్వారా డిజిటల్ విద్యాబోధన జరుగుతుందని, విశాలమైన తరగతి గదులతో పాటు క్రీడా ప్రాంగణంలో విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ విద్యను బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉచితంగా అందుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. గాజులపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు మాట్లాడుతూ అనుభవజ్ఞులు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరుగుతుందని, విద్యార్థిని విద్యార్థులలో పఠనా నైపుణ్యం పెంపొందడానికి తరగతి గది గ్రంథాలయం ఏర్పాటు చేశామని, తెలుగు, ఆంగ్లంలో అందరూ విద్యార్థుల చేతి రాత అందంగా ఉండే విధంగా ప్రతిరోజు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, విద్యతో పాటు క్రీడలు,సాంస్కృతిక అంశాలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే సమతుల్య భాగస్వామ్యం ఉంటుందని అన్నారు.కాగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రాజేశ్వర్, మధురకవి, శ్రీధర్, కిషన్ రెడ్డి, రాజు రమేష్ సాగరిక, నవీన్, నర్సింలు,రజిత,రోజా, గ్రామపెద్దలు పోతుగంటి మల్లారెడ్డి, మారపాక కనకయ్య, విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.