

(జనం న్యూస్ చంటి జూన్ 10)
పాఠశాల పున ప్రారంభం రోజుననే విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేయాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల స్థాయికి విద్యార్థులు ఏకరూప దుస్తులను పంపిణీ చేయడం జరిగిందని మండల విద్యాధికారి గజ్జల కనకరాజు అన్నారు. కులము మతము పేద ధనిక అనే ఎటువంటి తేడాలు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి సమానమే అనే నినాదంతో విద్యార్థులు కలిసిమెలిసి ఉండాలని ఏకరూప దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుంది. వీటితోపాటు పాఠ్యపుస్తకాలు అదేవిధంగా నోటు పుస్తకాలను ప్రభుత్వం అందిస్తుందని అందరు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం యాదగిరి సిబ్బంది ప్రధానోపాధ్యాయులు జగన్ ఉపాధ్యాయులు శివకుమార్ మండల వనరుల కేంద్రం సిబ్బంది శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.