

(జనం న్యూస్ చంటి జూన్ 10)
ఈరోజు దౌల్తాబాద్ మండలంలోని శేరిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలను కరపత్రం ద్వారా ముద్రించి గ్రామంలోని ప్రజలకు తెలియజేయడం జరిగింది ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత ఏకరూప దుస్తులు ఉచిత నోటు పుస్తకాలు మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అందిస్తుందని ఇట్టి సౌకర్యాలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమమైన విద్యా బోధన జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమల, హర్షిని క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాజు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.