

మండల విద్యాధికారి వెంకట రాములు
జనం న్యూస్, జూన్ 11 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
పాఠశాల పరిశుభ్రత పై ఉపాధ్యాయులకు పారిశుద్ధ్య కార్మికులకు మరియు వంట కార్మికులకు శిక్షణ కార్యక్రమం , కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ లో ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో పాఠశాల ను శుబ్రపరిచడానికి అన్ని రకాల సూచనలు మరియు శుబ్రం చేసే పరికరాలు గురించి వివరించడం జరిగింది. వంట కార్మికులకు వంట చేయడం లో తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలు, రుచికరమైన ఆహారం కోసం వంట విధానాలు పై శిక్షణా ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో కాంప్లెక్ ప్రధానోపాధ్యాలు వెంకటేశం , శంకర్ రెడ్డి ,లాతిసైద , పాఠశాలల ప్రధానోపాధ్యాలు, వంట కార్మికులు, పాఠశాల ,పారిశుద్య కార్మికులు పాల్గొన్నారు. మండల విద్యాధికారి వెంకట రాములు, అందరు కలిసి పాఠశాలల ను పరిశుభ్రం గా ఉంచి, మంచి రుచికరమైన,పౌష్టికరమైన, ఆహారం అందించడం ద్వారా పిల్లల మానసిక ఆరోగ్యం అందించాలని కోరారు.