

జనం న్యూస్ జూన్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని బీసీ సంక్షేమ భవనం లొ ఘనంగా నిర్వహించారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల జక్కన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీసీ ల రథసారథి, నిరంతరం బడుగు బలహీన వర్గాల కుల కోసం గలమెత్తుతూ, దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జాజుల శ్రీనివాస్ గౌడ్ స్ఫూర్తి తో బీసీలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని అన్నారు. రానున్న కాలంలో బీసీ ఉప కులాలు ఐక్యమై రాజ్యాధికారం సాధించుకోవడమే లక్ష్యంగా ఉండాలని, బీసీల ఆశయాలు నెరవేర్చే వరకు బిసి ఉద్యమం ముందుకు సాగుతుందని దీనికోసం ప్రతి ఒక్కరు బీసీలు, కొడుకు బలహీన వర్గ ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘ యువజన అధ్యక్షులు మామిడి కిరణ్, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వైరాగడే మారుతీ పటేల్, రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డల శంకర్, మండల అధ్యక్షులు బాలదారపు మధుకర్, బీసీ సంఘ జిల్లా కార్యదర్శి మిట్ట తిరుపతి, సంఘ సభ్యులు నాయకిని రాజన్న, ఎరబోతు అశోక్, మారశెట్టి కృష్ణమూర్తి, అబ్బు సలీం తదితరులు పాల్గొన్నారు.