Listen to this article

పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యకరమైన జీవితం..

హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య..

జనం న్యూస్, జూన్ 11, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ )

ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు వేడుకలకు మొక్కలు నాటాలనీ, దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవితం ఏర్పడుతుందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీ అంగన్వాడీ టీచర్, సామాజిక కార్యకర్త కోటోజు జ్యోతిరాణి కుమారుడు సాయికిరిటి జన్మదినం సందర్భంగా హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, వార్డ్ అధికారులు నూనే రమేష్, రొడ్డ సురేష్, అందే రవీందర్, వెంకటరమణ, రజిత, నాగమణి, అనుషలు పలు రకాల ఔషధ మొక్కలను మున్సిపల్ ఆవరణంలో నాటడం జరిగింది. ఎవరైనా జన్మదిన, వివాహ వేడుకలకు కేకులు కట్ చేసి డబ్బులు దుబారా చేస్తే బధలు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రజాసంక్షేమాన్ని ఆశించి విరివిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి అన్నారు. జ్యోతి రాణి గత 20 ఏళ్లుగా తమ పిల్లల పుట్టినరోజుకు మొక్కలు నాటడం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా రావడం అభినందనీయమన్నారు. మరియు విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా జ్యోతి రాణి సుమారు 10,000 రూపాయల విలువ గల పోటీ పరీక్షల పుస్తకాలను హుజురాబాద్ లైబ్రరీకి అందజేయడం జరిగిందనీ, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మండల యాదగిరి, సీనియర్ పాత్రికేయులు ఆనుమాస రాజేందర్, పరాంకుశం కిరణ్ కుమార్, గడ్డం హర్షవర్ధన్, చిలుకమారి సత్యరాజు, కె శ్రీధర్, సబ్బని వెంకటేష్, భాషబోయిన రాజు,ఆయుర్వేద వైద్యుడు సుధాకర్, అంగన్వాడీ టీచర్లు సుకన్య, సబిత, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.