Listen to this article

జనం న్యూస్ జూన్ 10 నడిగూడెం

వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముత్తినేని సైదేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్న తరుణంలో నకిలీ విత్తనాల భారీన పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీజన్ ప్రారంభానికి ముందే సరిపడా ఎరువులను అందుబాటులో వుంచడంతో పాటు రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని మేజర్, మైనర్ కాలువలకు వెంటనే మరమ్మతులు నిర్వహించి, సాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భయ్యా నారాయణ, మండల అధ్యక్షుడు గుండు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్ కె జహీర్, నాయకులు గురవయ్య, వాసు, పల్లపు నాగేశ్వరరావు, అచ్చయ్య, కోటిరెడ్డి, ఖాసిం, వెంకయ్య, గోవిందు, సాంబశివరావు తదితరులు తదితరులు పాల్గొన్నారు..