

జనం న్యూస్ జూన్ 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుద్ధ సిబ్బంది కూడా భాగస్వాములేనని మునగాల మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మండలంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు,పారిశుద్ధ కార్మికులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. మధ్యాహ్న భోజనం తయారీలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రవికుమార్, రామ్మూర్తి, మరియు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికులు, సీఆర్పీలు రాజేంద్రప్రసాద్, కోటేశ్వరరావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.