Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల నందలూరు విద్యార్థినికి షైనింగ్ స్టార్స్ 2025 అవార్డు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందు గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల నందలూరులో చదివిన విద్యార్థిని అయినటువంటి వెంకట శైలజ పదవ తరగతి పరీక్షలో 579 మార్కులు సాధించి సోమవారం రాయచోటి నందు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ 2025 అవార్డును అందుకున్నది.ఈ అవార్డు తమ విద్యార్థిని అందుకోవటం చాలా గర్వంగా ఉందని అలాగే తమ పాఠశాల విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించుటకు కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపిన పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరీ.