

జనం న్యూస్ జూన్ 10 నడిగూడెం
నడిగూడెం గ్రామానికి చెందిన టిడిపి గ్రామ శాఖ అధ్యక్షుడు గుడిపల్లి సీతయ్య మృతి బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుదీర్ అన్నారు.మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన సీతయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పార్టీలు వేరైనాప్పటికి సిద్ధాంతల కోసం పార్టీ అధికారంలో ఉన్నా,లేకున్నా గ్రామంలో పార్టీ బలోపేతం కోసం నిజమైన కార్యకర్తగా గత ప్రభుత్వాన్ని ఓడించేందుకు గ్రామంలో కాంగ్రెస్ పార్టీతో టిడిపి కలిసి పని చేయడంలో ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. ప్రజల తరపున పోరాడుతూ టీడీపీ పార్టీకి ఎంతో సేవ చేశారని సీతయ్య సేవలు మరువలేనివి అన్నారు.అనంతరం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్, దున్న శ్రీనివాస్, పల్లపు శీను, గుండు శ్రీను, గుండు లింగరాజ్ , ఎలుగూరి నాగరాజ్ , విజయ్, వంశీ, శ్రీకాంత్, మధు, దినేష్,కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.