

పోలీసులకు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు.
నకిలీ విత్తనాల అమ్మి రైతులను మోసగిస్తే కఠిన చర్యలు.
*కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహిమాన్.
జనం న్యూస్,జూన్10,జూలూరుపాడు:
కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో అక్రమార్కులను వెంటాడి పట్టుకోవడంలో కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహిమాన్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ తరణం ఆసన్నమవడంతో కొత్తగూడెం డివిజన్ పరిధిలోని పోలీస్ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి రైతులకు మోసపూరితంగా అక్రమ మార్గంలో విత్తనాలు పురుగుమందులు అమ్మేవారిపై ప్రత్యేకమైన నిఘాను చేపట్టారు మంగళవారం ఉదయం జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామంలో నకిలీ మిర్చి విత్తనాలు విక్రయిస్తున్న ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, పెద్ద కోరుకొండ కి చెందిన జనతా సీడ్స్ మార్కెటింగ్ మేనేజర్ నున్న మహేష్, ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన పల్లపు తిరుపతిరావు అనే ఇరువురు గత కొంతకాలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నందు జనతా సీడ్స్ షాపు వద్ద నుండి ప్రజ్వల్ సీడ్స్డి.ఎస్.పి కంపెనీ వారి కావ్య మిర్చి విత్తనాలను తక్కువ రేటు కొనుగోలు చేసి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎక్కువ దిగుబడులు వస్తాయని రైతులకు మాయమాటలు చెప్పి రైతులను మోసగిస్తున్నారు. జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో నకిలి మిర్చి విత్తనాలు విక్రయిస్తున్న విషయమై మండల వ్యవసాయ అధికారికి సమాచారం అందగా వారు అందించిన సమాచారం మేరకు స్థానిక పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కే వెంకటరత్నం, కానిస్టేబుల్ జి వెంకటేశ్వరరావు లతో కలిసి వెళ్లి గ్రామంలో తనిఖీలలో ఇద్దరు వ్యక్తులు విత్తనాలు అమ్ముతూ పట్టుపడ్డారు.ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 115 మిర్చి విత్తనాల ప్యాకెట్లను, హుండై క్రేట కారును, 13 వేల రూపాయల నగదును, వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై బాదావత్ రవికుమార్, క్లస్టర్ వ్యవసాయ శాఖ అధికారి జేవిడి ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి ఆనందు దీపక్ పాల్గొన్నారు.