

జనం న్యూస్ 24ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు)
వికారాబాద్ జిల్లా, పూడూర్, మండల పరిధిలోని మంచన్ పల్లి ZPHS హైస్కూల్లో 2008-2009 వ SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తేది 10.06.2025 మంగళవారం రోజున నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. మిత్రులు అందరూ కలిసి ఉల్లాసంగా గడిపారు. పూర్వపు మధురస్మృతులను నెమరు వేసుకున్నారు. ఇలాంటి కలయికలు మరెన్నో జరగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాపతి, జాకిర్ ఆలీ, అనంతరావు, కాజా పాషా, సుమంత్, చెన్నయ్య, వీరన్నసార్ మరియు పూర్వ విద్యార్థి విద్యార్థినిలు పాల్గొనడం జరిగింది.